అక్టోబర్ 8న ఐజెయు మండల మహాసభను విజయవంతం చేయండి
-జిల్లా ఉపాధ్యక్షులు షేక్ బుడాన్
-జిల్లా సహాయకార్యదర్శి రావూరి ప్రశాంత్

మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్22(జనంసాక్షి)

టీయూడబ్ల్యూజె (ఐజెయు) అక్టోబర్ 8వ తేదీన జరిగే గార్ల మండల మహాసభ విజయవంతం చేయాలని టీయూడబ్ల్యూజె (ఐజెయు) మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ బుడాన్, జిల్లా సహాయ కార్యదర్శి రావూరి ప్రశాంత్ పిలుపునిచ్చారు. గార్ల మంగపతిరావు భవనం లో శుక్రవారం జరిగిన ఐజెయూ మండల మహాసభ సన్నాహాక సమావేశంలో వారు మాట్లాడుతూ గ్రామీణ విలేకరుల సంక్షేమాన్ని కాంక్షించి రాష్ట్రం ప్రభుత్వం ప్రకటించన పథకాలు అమలు చేసే విధంగా ప్రభుత్వంపై పోరాటానికి సంఘాలకు అతీతంగా విలేఖరులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అక్టోబర్ 8న జరిగే మహాసభకు జర్నలిస్టులాంత తరలాలని, విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా కౌన్సిల్ సభ్యుడు తోడేటి రాము, తాళ్ళూరి కొండల్ రావు, నేలం శ్రీనివాస్, రూపన్ శంకర్, మాదా శ్రీకాంత్, కూనమల్ల కృష్ణ కుమార్, దువ్వా సతీష్, రవిశంకర్, పిడుగు సురేందర్, మహ్మద్ జాన్ ఖాన్, ఈశ్వర లింగం, వజ్రం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.