రూ.16,500 కు (లడ్డు) వినాయక ప్రసాదం
యల్.ప్రశాంత్ కైవసం.

తాండూరు సెప్టెంబర్ 22 (జనం సాక్షి) వికారాబాద్ జిల్లా యాలాల మండలం దేవనూరు గ్రామం శివాలయంలో శివాలయం
ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయకుని
భక్తిశ్రద్ధలతో ప్రతిష్టాపించారు.గత ఐదు రోజులుగా ఉదయం సాయంత్రం వేళలో విశేష పూజలు అందుకున్న వినాయక ప్రసాదం( లడ్డు) గ్రామానికి చెందిన లింగమంతుల ప్రశాంత్ రూ.
16,500కు కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా శివాలయం ఉత్సవ కమిటీ సభ్యులు వేలం పాటలో లడ్డును కైవసం చేసుకున్న ప్రశాంత్ కు అందజేశారు. ఈ సందర్భంగా లింగమంతుల ప్రశాంత్ మాట్లాడుతూ వినాయకుని ప్రసాదం లభించడం సంతోషకరమన్నారు.లంబోదరుని కరుణా కటాక్షాలు నిండుగా ఉన్నాయని అందుకే లడ్డు తమ సొంతమైందని తెలిపారు. శివాలయంలో ప్రతిష్టాపించిన వినాయకుని లడ్డు వేలంపాటలో దక్కించుకోవడం పట్ల అన్ని కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో శివాలయం ఉత్సవ కమిటీ సభ్యులు ఎల్. నాగలింగం, ఎల్. బసవరాజ్ ,
ఎల్ భూదేవప్ప,ఎల్. శ్రీనివాస్, సంగమేశ్వర్,
ఎల్. రవి కుమార్, ఎల్ నీలకంఠం ,సి రాజేందర్ గౌడ్, ఎల్ మహేందర్, రమేష్ తదితరులు ఉన్నారు.