కౌన్సిలర్ మహమ్మద్అ స్లంను పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి.

తాండూర్ సెప్టెంబర్ 22( జనంసాక్షి) ఇటీవలే కారు ప్రమాదానికి గురై స్వల్పంగా గాయపడిన 4వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ ముహమ్మద్ అస్లంను శుక్రవారం తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆయన నివాసంలో పరామర్శించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ మహమ్మద్ అస్లంకు జరిగిన ప్రమాదంపై ఆరా తీశారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కౌన్సిలర్ మరియు మాజీ ఉర్దూగర్ చైర్మన్ అబ్దుల్ సలీం సలీమ్ లను సన్మానించారు. ఎమ్మెల్యే వెంట పట్టణ అధ్యక్షులు నయీమ్, సీనియర్ నాయకులు నర్సింలు ఉన్నారు.