గణేష్ విగ్రహాల నిమజ్జనానికి గోదావరి ప్రాంతాన్ని పరిశీలించిన కమిషనర్: రమేష్..

ధర్మపురి (జనం సాక్షి) ధర్మపురి పట్టణ కేంద్రంలో గణేష్ ఉత్సవాల సందర్భంగా శుక్రవారం ఉదయం మున్సిపల్ కమిషనర్ గోదావరి తీర ప్రాంతానికి వెళ్లే రహదారులన్నిటిని ఏర్పాట్లకు సిద్ధం చేస్తున్నారు. విగ్రహల శోభ యాత్ర మరియు నిమజ్జనననికి సంబంధించి రహదారులు మరియు నిమ్మజనం చేయు గోదావరి ప్రాంతాన్ని పరిశీలించినట్లు మున్సిపల్ కమిషనర్ మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సంగి సత్తేమ్మ, వైస్ చైర్మన్ ఇందరపు రామన్న, మున్సిపల్ కౌన్సిలర్ తరల్లా కార్తిక్, సానిటరీ ఇన్స్పెక్టర్ గంగాధర్ నాయకులు సంగి శేఖర్, షబ్బీర్, మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.