సమ్మె చేస్తున్న అంగన్వాడీ లకు మద్దతు పలికిన బీఎస్పీ.

కోడేరు జనం సాక్షి సెప్టెంబర్ 22
మండల కేంద్రంలో అంగన్వాడీ ఉద్యోగులు 12రోజులుగా సమ్మె చేస్తున్నారు. సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు కోడేరు మండల బిఎస్పి పార్టీ మద్దతు ప్రకటించింది.
ఈ సమ్మెను ఉద్దేశించి బహుజన సమాజ్ పార్టీ కోడేర్ మండల అధ్యక్షులు దేవర పాగ దర్గస్వామి, మాట్లాడుతూ వీరికి కనీస వేతనం 26000 వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఇదే అంగన్వాడీ ఉద్యోగులకు వారు అడిగిన కనీస వేతనం అమలు చేస్తామని ఆయన మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు 1,మబ్బు రాము మండల ఉపాధ్యక్షులు 2,రాజు, యదవ్ , మండల ప్రధాన కార్యదర్శి కంట్రోల్ రాజు, మండల కార్యదర్శి శివ, మండల కార్యదర్శి నాగశేషు, తీగలపల్లి గ్రామ అధ్యక్షులు విఎన్ రాజు అంగన్వాడీలు తదితరులు పాల్గొన్నారు.