మురికి కాలువల సమస్యలు పట్టవా ?

బాల్కొండ సెప్టెంబర్ 22 (జనం సాక్షి ) బాల్కొండ మండలం వన్నెల్ బి గ్రామంలోని ఎస్సి వాడలో మురికి కాలువలలో చెత్తాచెదారం నుండి రోడ్లపై మురికి నీరు పారుతూ దుర్గంధం వెదజల్లుతుంది. మురికి కాలువకు ఇరువైపుల పిచ్చి మొక్కలు పేరుకుపోయాయి. చిన్న వర్షానికి మురికి కాలువ నిండి రోడ్లపై మురికి నీరు పారే పరిస్థితి నెలకొంది. మురికి కాలువల సమస్య తీర్చి వర్షాకాలంలో ప్రభలే వ్యాధులనుంచి తమను కాపాడాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణం స్పందించి ముఖ్య కాలువలను శుభ్రం చేయాలని కాలనీవాసులు ముక్తకంఠంతో కోరుతున్నారు.