గణపయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు
25వ వార్డు కౌన్సిలర్ ప్రభాకర్.

తాండూరు సెప్టెంబర్ 22(జనంసాక్షి)తాండూరు పట్టణం 25వ వార్డులో బ్రదర్స్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో వినాయకుని ప్రతిష్టాపించారు. శుక్రవారం
తాండూర్ పట్టణం 25 వ వార్డు బ్రదర్స్ వినాయక ఉత్సవ కమిటీ లో ప్రతిష్టాపించిన
వినాయకుని 25వ వార్డు కౌన్సిలర్ ప్రభాకర్ రావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా బ్రదర్స్ వినాయక ఉత్సవానికి కమిటీ సభ్యులు ఆయనను శాలువాపూలమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం బ్రదర్స్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బ్రదర్స్ వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు
గోవింద్, మల్లేష్, హనుమంత్, రమేష్, మహేష్, నవీన్, గణేష్, నరేందర్, శంకర్,తదితరులు ఉన్నారు.