గణేష్ నిమజ్జనాలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్సై సంపత్

రాజంపేట్ సెప్టెంబర్ 22 జనం సాక్షి

రాజంపేట్ మండలంలోని తలమడ్ల గ్రామంలో గణేష్ నిమజ్జనం కార్యక్రమాలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్సై సంపత్ పేర్కొన్నారు తలమడ్ల గ్రామంలో యువత కుల సంఘాల పెద్దలు గ్రామ సర్పంచ్ యాదవ రెడ్డి, ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మండపాల వద్ద పేకాట బొమ్మ బొరుసు ఇతర ఆటలు ఆడ వద్దని భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహించుకోవాలని అన్నారు నిమర్జనం రోజున గ్రామంలో అన్ని వినాయకులను ఒకేరోజు తరలించాలా చూడాలని అన్నారు గ్రామంలో శాంతియుతంగా ఉత్సవాలు నిర్వహణకు యువకులు పోలీసులకు సహకరించాలని కోరారు.