విఘ్నాలు తొలగించి విజయాలు ప్రసాదించాలి.

మల్కాజిగిరి.(జనంసాక్షి) సెప్టెంబర్ 22
ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ లంబాడా బస్తీలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. పూజారులు ఆయనకు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందజేశారు.మండప నిర్వహకులు శాలువాలతో సత్కరించారు.అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా నందికంటి శ్రీధర్ మాట్లాడుతూ.మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలకు విఘ్నాలు తొలగించి విజయాలు ప్రసాదించాలని స్వామివారిని కోరామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయ్, ఉమేష్ సింగ్,రెబ్బ వాసు,శ్యామ్ రావు, పవన్,మార్షల్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.