ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు రాములుకు సన్మానించిన నాయకులు

జహీరాబాద్ సెప్టెంబర్ 23
జనం సాక్షి

జహీరాబాద్ నియోజకవర్గము మొగుడంపల్లి మండలం, గ్రామం మొగుడంపల్లి కు చెందిన బోయిని రాములు ను జిల్లా సమావేశంలో మొగుడంపల్లి ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు గా నియమించారు.స్థానిక సంగారెడ్డి జిల్లా లో జిల్లా అధ్యక్షుడు పులిమామిడి రాజు అధ్యక్షత న ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించి,అందరి సమక్షంలో ఏకీగ్రీవంగా ఎన్నుకుని నియామక పత్రన్నీ అందించారు.
ఈ సందర్భంగా మొగుడంపల్లి మండల ఉప సర్పంచ్
పాషియొద్దిన్ ఆధ్వర్యంలో నూతన అధ్యక్షులు రాములకు బీఆర్ఎస్ కార్యాలయంలో శాలువా,పూలమాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం మొగుడంపల్లి అధ్యక్షులు రాములు మాట్లాడుతూ..మొగుడంపల్లి మండలం లో ముదిరాజ్ సమస్యలు,హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేస్తాను అన్నీ అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పాషియొద్దిన్,మమ్మద్ ముల్తాని,భాస్కర్ రెడ్డి,షికారి శీను, పోతే పంగారి రాజు,యూనుస్, కొంగల్ అంజన్న,పాండు, జట్టప్ప,ముజామిల్,రాములు,లక్ష్మారెడ్డి,మహేశ్ తదితరులు పాల్గొన్నారు.