అన్నిదానాల కన్నా అన్నదానం మిన్న…

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): అన్నిదానాల కన్నా అన్నదానం మిన్న అని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గండూరి ప్రకాష్
అన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని 43వ వార్డ్ నెహ్రూ నగర్ లో మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ బత్తుల ఝాన్సీ రమేష్ ఆధ్వర్యంలో జరుగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నీడ్స్ టైలర్ షోరూం నగేష్ నిర్మల , ఆయుష్ హాస్పిటల్ డాక్టర్ శ్రీరామ్ కుమార్ స్రవంతి దంపతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.నెహ్రూ నగర్ లో గత 35 ఏళ్లుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం అభినందనీయం అన్నారు. గణపతి నవరాత్రోత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో బత్తుల వెంకటయ్య, బీఆర్ఎస్ వార్డ్ కార్యదర్శి మీనయ్య , వార్డ్ మహిళా అధ్యక్షురాలు బత్తుల కౌసల్య, కార్యదర్శి నల్లపాటి ప్రమీల,యూత్ అధ్యక్షులు మక్కల శంకర్, కార్యదర్శి మక్కల రవి, గుంజ శివయ్య, నిమ్మనగోటి వెంకన్న, వేముల మోహన్, రఘు, ప్రవీణ్, రూపని రోజా, నల్లపాటి జ్యోతి, బింగి రేణుక,మైసమ్మ, కోడూరి నిర్మల, నామ రాంబయమ్మ తదితరులు పాల్గొన్నారు.