మేరా మిట్టి మేరా దేశ్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి

రాజంపేట్ సెప్టెంబర్ 22 జనంసాక్షి

రాజంపేట్ మండలంలోని శివాయిపల్లి గ్రామాల్లో మేరా మిట్టి మేరా దేశ్ కార్యక్రమాల్లో పాల్గొన్నా బిజెపి కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జ్ కాటీపల్లి వెంకటరమణారెడ్డి శివాయిపల్లి గ్రామంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలు కుల సంఘాల నాయకులు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
ఈ సందర్భంగా కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర సమరయోధులు, సైనిక అమర వీరుల త్యాగాలకు గుర్తుగా దేశ రాజధాని ఢిల్లీ లో నిర్మించే స్మృతి వనం కోసం దేశం మొత్తం గ్రామాల నుండి మట్టి సేకరణ కార్యక్రమం దేశ ప్రధాని నరేంద్రమోదీ చేపట్టారని అందులో బాగంగా కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలలో ప్రజల నుండి మట్టి సేకరిస్తున్నామని ఈ కార్యక్రమంలో మహిళలు, కుల సంఘాల నాయకులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని వారి దేశ భక్తిని చాటుకుంటున్నారని అన్నారు. అమరుల త్యాగాలను భవిష్యత్తు తరాలకు తెలియజేయాలనే సదుద్దేశంతో మోదీ ఈ కార్యక్రమం చేపట్టారని అన్నారు ఇట్టి కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు బక్కి సంధ్య బాల్రాజ్, మండల అధ్యక్షులు గంగారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పిట్ల శ్రీనివాస్, రాజంపేట్ పట్టణ అధ్యక్షులు గుర్రాల రాము, పట్టణ ఉపాధ్యక్షులు బాల్ నర్స్, ఓ బి సి అధ్యక్షులు చిన్నస్వామి, మనోహర్ రెడ్డి, జుక్కంటి రాజిరెడ్డి, కమ్మరి నాగరాజు చారి, సుమన్ చారి, సంపత్ గౌడ్, మండల వివిధ కుల సంఘాల పెద్దమనుషులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.