హైమాస్ లైట్ల ప్రారంభం

వేములవాడ గ్రామీణం, సెప్టెంబర్ 22 (జనంసాక్షి): వేములవాడ గ్రామీణ మండలంలోని ఫాజల్ నగర్,తుర్కాషినగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన హైమాస్ లైట్లను శుక్రవారం బిజెపి జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, గ్రామీణ ఎంపీపీ బండ మల్లేశం ప్రారంభించారు. ఫాజుల్ నగర్ గ్రామంలో పోచమ్మ గుడి, ఎస్సీ కాలనీ, ముదిరాజ్ పెద్దమ్మ గుడి, తుర్కాశినగర్ లో చౌరస్తా, గ్రామపంచాయతీ దగ్గర ఎంపీ బండి సంజయ్, మండల పరిషత్ నిధుల ద్వారా రూ. 10 లక్షలతో వీటిని ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. అలాగే ఫాజుల్ నగర్ బీరప్ప గుడి వద్ద మరొక లైట్ తో పాటు, సిసి రోడ్డు నిర్మాణానికి ఎంపీ బండి సంజయ్ రూ. 4.5 లక్షలు కేటాయించారని బిజెపి గ్రామీణ అధ్యక్షుడు జక్కుల తిరుపతి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ బండి సంజయ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే గ్రామ అభివృద్ధికి మరిన్ని నిధులను కేటాయించేలా చూస్తానన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ సెక్రెటరీ మహిళా, ముదిరాజ్, కురుమ, ఎమ్మార్పీఎస్ సంఘ నాయకులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.