గణపతి మండపాల వద్ద కుంకుమ పూజలు

వేములవాడ, సెప్టెంబర్ 22 (జనసాక్షి): గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పట్టణంలో ఏర్పాటు చేసిన ఉప్పు గడ్డ, హనుమాన్ టెంపుల్, మార్కెట్ ఏరియా, మంటప హనుమాన్ వద్ద శుక్రవారం ఘనంగా కుంకుమ పూజలు నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున భక్తిశ్రద్ధలతో పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు.నిత్య,శ్రేష్ట, సాక్షిన్య,మహాలక్ష్మి,శివన్య ప్రసీద, దీక్షిత,సన్నీ,బిట్టు,మధు, వినయ్,అజయ్,చంటి తదితరులు ఉన్నారు.