అంగన్వాడి ఉద్యోగులకు న్యాయం చేయాలి

కోడేరు జనం సాక్షి సెప్టెంబర్ 22
అంగన్వాడి ఉద్యోగులకు సరైన న్యాయం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ర్యాలీ నిర్వహించి కార్యాలయం లో తహసిల్దార్ సైదులు కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు ఎం శ్రీనివాస్ లు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి. నరసింహ డిమాండ్ చేశారు. అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.అదేవిధంగా రిటైర్మెంట్ సమయంలో టీచర్లకు 10 లక్షలు, హెల్పర్లకు 5 లక్షలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. 2017 నుండి కేంద్ర ప్రభుత్వం పెంచిన వేతనం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వరలక్ష్మి పద్మ డి లక్ష్మి భాగ్యలక్ష్మి, కృష్ణమ్మ, స్వాతి, తదితరులు పాల్గొన్నారు.