బిఆర్ఎస్ ప్రభుత్వం తోనే రాష్ట్రాభివృద్ది
* అభివృద్ధి చేసి చూపిస్తున్నాం ఆశీర్వదించండి
* ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ నాయక్

టేకులపల్లి, సెప్టెంబర్ 22( జనం సాక్షి ): గత 50 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి ఈ పదేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ అన్నారు. శుక్రవారం ఇల్లందు నియోజకవర్గం టేకులపల్లి మండలంలోని పలు గ్రామపంచాయతీలలో 3 కోట్ల 4 లక్షలు రూపాయల డి ఎం ఎఫ్ టి , ఎస్ డి ఎఫ్ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం ఎమ్మెల్యే చేతుల మీదుగా చేశారు. రోల్లపాడు, గోలియా తండ, లక్ష్మీపురం, పాత స్టేషన్ తడికలపూడి, కోకియ తండా, రాంపురం తండా, పాత తండా, పెగళ్ల పాడు పంచాయతీలోని దుబ్బ తండా, తూర్పు గూడెం, దాస్ తండా పంచాయతీలోని సింగ్యా తండా గ్రామాలలో ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించి పలు సిమెంట్ రోడ్లకు శంకుస్థాపనలు, సిసి రోడ్లు పూర్తయిన వాటికి ప్రారంభోత్సవాలు చేశారు. ఈ పర్యటనలో ఎమ్మెల్యేకి ఆయా గ్రామ ప్రజలు, మహిళలు మేళ్ల తాళాలతో, పూల వర్షం కురిపిస్తూ, సత్కరిస్తూ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రగల్లపాడు రైతు వేదికలో బిఆర్ఎస్ నాయకులు లక్కినేని శ్యామ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఇల్లందు నియోజకవర్గంలో రెండు లక్షల 8 వేల ఓటర్లు ఉండగా, ఒక లక్ష 25 వేల మంది వివిధ సంక్షేమ పథకాలతో లబ్ధి పొందుతున్నారన్నారు. ఇదే నియోజకవర్గంలో 75 వేల మంది రైతుబంధు పొందుతున్నారన్నారు. సంక్షేమంతో పాటు కోట్లాది రూపాయలతో ప్రతి పల్లెను కలుపుతూ బీటీ రోడ్లను నిర్మాణం చేసుకోవడం జరిగిందన్నారు. ఒకప్పుడు వర్షాలు వచ్చాయంటే బయటకు వెళ్లే పరిస్థితి లేదన్నారు. అలాంటి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ గ్రామాలలో అధిక నిధులను క�