నెల 29న మంత్రి కెటిఆర్ వనపర్తి కి రాక….

666.42 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు

కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలి

రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

వనపర్తి బ్యూరో సెప్టెంబర్ 22( జనం సాక్షి)

వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానం, గంజ్ లో టౌన్ హాల్, సమీకృత మార్కెట్, మెడికల్ కళాశాల ప్రాంతాలను శుక్రవారం పరిశీలించి అధికారులకు కేటీఆర్ పర్యటన, బహిరంగసభ ఏర్పాట్లపై రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రూ.425 కోట్ల మిషన్ భగీరధ పథకం,
రూ.73 కోట్ల తో బైపాస్ రహదారి నిర్మాణానికి శ్రీకారం.రూ.5.08 కోట్లతో రాజాపేటలో నిర్మించిన 96 డబల్ బెడ్రూం ఇండ్లు లబ్దిదారులకు అందజేత.
రూ.75 లక్షలతో నిర్మించిన ఆచార్య జయశంకర్ పార్క్, కాంస్య విగ్రహం ఆవిష్కరణ.
రూ.2.80 కోట్లతో నిర్మించిన షాదీఖానా ప్రారంభం.
రూ.2.75 కోట్లతో నిర్మించే బీఎస్సీ అగ్రికల్చర్ కళాశాలకు శంకుస్థాపన .నాగవరం వద్ద రూ.1.02 కోట్లతో నిర్మించిన భూసార పరీక్షల కేంద్రం, రూ.50 లక్షలతో నిర్మించిన యానిమల్ కేర్ యూనిట్, రూ.కోటితో నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్ ప్రారంభం.రూ.22 కోట్లతో నిర్మించే వనపర్తి కేడీఆర్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థిని, విద్యార్థుల వసతి గృహాలకు శంకుస్థాపన, రాజభవనం పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన .వనపర్తి జిల్లా కేంద్రంలో రూ.15 కోట్లతో నిర్మించే అంతర్గత రహదారులు, డ్రెయిన్ల పనులకు శంకుస్థాపన.
రూ.కోటితో రాజీవ్ చౌక్ లో నిర్మించిన సురవరం గ్రంథాలయం, గంజ్ లో రూ.20 కోట్ల సమీకృత మార్కెట్, రూ.5.75 కోట్లతో నిర్మించిన టౌన్ హాల్ ప్రారంభం.పీర్లగుట్టలో రూ.15.50 కోట్లతో నిర్మించిన 294 డబల్ బెడ్రూం ఇండ్లు, రూ.1.25 కోట్లతో నిర్మించిన వైకుంఠధామం ప్రారంభం.
రూ.48.50 కోట్లతో నిర్మించే పెబ్బేరు రహదారి పనులు, రూ.25.52 కోట్లతో నిర్మించే జేఎన్ టీయూ హాస్టల్ భవనాలకు శంకుస్థాపన .గంజ్ లో ఐటీ టవర్ నిర్మాణానికి శంకుస్థాపన. ఈ నెల 29న మొత్తం రూ.666.42 కోట్ల పనులకు ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.ఈ పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.
పెండింగ్ పనులన్నీ పూర్తిచేయాలి అని అధికారుల ను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్, మార్కెట్ చైర్మన్ పలుస రమేష్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, సూపరిండెంట్ ఇంజనీర్ రాధాకృష్ణమూర్తి ,డి ఈ. ఈ నాగేశ్వరరావు ,ఏఈ కృష్ణయ్య, కాంట్రాక్టర్, డి ఎం ఓ స్వరణ్ సింగ్, మార్కెట్ సెక్రెటరీ లక్ష్మయ్య, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నేతలు తదితరులు పాల్గొన్నారు.