లంబోధరుడు కి భక్తిశ్రద్ధలతో నిమజ్జనం

మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్యవిటల్ నాయక్.
తాండూరు సెఫ్జెంబర్ 23(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్యవిటల్ నాయక్ నివాసంలో గత ఐదు రోజులుగా విశేష పూజలు అందుకున్న గణనాథుని కుటుంబ సమేతంగా కలిసి గంగమ్మ ఒడికి చేర్చారు. తన నివాసంలో ప్రతిష్టాపించిన బొజ్జ గణపయ్యను భక్తిశ్రద్ధలతో కొలుస్తూ గౌరమ్మ ముద్దుల తనయుని గంగమ్మ ఒడికి సాగనంపారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య విటల్ నాయక్ మాట్లాడు తూ గత ఐదు రోజులుగా విశేష పూజలు అందుకున్న లంబోధరున్ని భక్తిశ్రద్ధలతో కొలుస్తూ నిమజ్జనం చేశామన్నారు .భక్తిశ్రద్ధలతో వినాయక నిమజ్జనం జరుపుకోవాలని కోరారు. చెడు వ్యసనాలకు పాల్పడకుండా భక్తిపార్వస్యం గా గణనాథుని కొలుస్తూ గంగమ్మ ఒడికి సాగనం పాలని కోరారు. గణపతి బప్పా మోరియా… వర్ష వర్షా లౌకర్య అంటూ జై బోలో గణేష్ మహరాజ్ కి జై అన్నారు.ఈ కార్యక్రమం లో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య విటల్ నాయక్ కుటుంబ సభ్యులు వర్త్య కిష్టమ్మ,, కూతురు వర్త్య ప్రశాంతి ,వర్త్య రవికుమార్ తదితరులు ఉన్నారు.