భాజపా ఆధ్వర్యంలో ఘనంగా దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి.

వనపర్తి బ్యూరో సెప్టెంబర్25 (జనంసాక్షి)

భారతీయ జనతా పార్టీ 2వ జాతీయ అధ్యక్షులు పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ 107 వ జన్మదినోత్సవం బిజెపి వనపర్తి పట్టణ అధ్యక్షులు బచ్చు రాము ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.వనపర్తి జిల్లా కేంద్రంలో ని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి జిల్లా ఇన్చార్జి బోస్ పల్లి ప్రతాప్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎద్దుల రాజవర్ధన్ రెడ్డి హాజరయ్యారు.అనంతరం వారు మాట్లాడుతూ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ చిట్టచివరి వ్యక్తికి అభివృద్ధి ఫలాలు అందాలని ఆకాంక్షించిన గొప్ప నాయకులని ఏకాత్మతా మానవతావాద దర్శనం సిద్ధాంతం ప్రతిపాదించిన నాయకులని వారి సిద్ధాంతం ఆధారంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ప్రవేశపెట్టారని ఆరోజు పార్టీని సంస్థాగతంగా అభివృద్ధి చేయడం వల్ల పార్టీ రెండు సీట్ల నుంచి 303 వరకుకు ఎంపీ స్థానాలు గెలిపించి 16 రాష్ట్రాల్లో సొంతంగా అధికారంలో ఉన్న అతిపెద్ద పార్టీగా బిజెపి అవతరించింది దేశంలో బిజెపి రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావాలంటే బూత్ కమిటీలను పటిష్టం చేయాలని వారన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీశైలం బిజెపి వనపర్తి నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ జింకల కృష్ణయ్య జిల్లా ఉపాధ్యక్షులు సీతారాములు కుమారస్వామి బిజెపి జిల్లా కార్యదర్శి చిత్తారి ప్రభాకరబోయిల రామ్మోహన్ బిజెపి జిల్లా అధికార ప్రతినిధి బాబురావు బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అనుజ్ఞ రెడ్డి దళిత మూర్తి జిల్లా అధ్యక్షుడు కుమార్ మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కరీం బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ గౌడ్ బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి నందిమల్ల రవి రాయన్న సాగర్ దళిత మూర్తి నాయకులు నారాయణ తదితరులు హాజరయ్యారు.