నేడు శివ జ్యోతి నగర్ లో వినాయక లడ్డూ వేలం ప్రకటన భక్తులకు మహా అన్నదానం

కొండమల్లేపల్లి సెప్టెంబర్ 25 జనం సాక్షి : కొండమల్లేపల్లి పట్టణ కేంద్రంలో నల్లగొండ రోడ్డులోని శివ జ్యోతి నగర్ లో గణపతి నవరాత్రి మహోత్సవాలను శివ జ్యోతి నగర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని వినాయక మండపం వద్ద భక్తి శ్రద్ధలతో భక్తులందరూ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి గణనాథునికి ప్రత్యేక నైవేద్యాన్ని సమర్పించి గణపతి నవరాత్రోత్సవ వేడుకలలో పాల్గొంటున్నారు ప్రతీరోజు రెండు పూటలూ గణపతి మండపంలో గణనాథుడికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తూ భక్తిశ్రద్ధలతో భజనలు చేస్తున్నారు ప్రతిరోజు కుంకుమార్చన గణపతి అష్టోత్తర నామాల పఠన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు రాత్రివేళ పూజల అనంతరం మహిళలు, యువకులు, పిల్లలు ఆనందోత్సవాల మధ్య కోలాటాలు,భక్తి గీతాలు, భక్తి గీతాలతో కూడిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు రాత్రి పూజల అనంతరం ప్రత్యేక క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా శివ జ్యోతి నగర్ ఉత్సవ కమిటీ వారు మాట్లాడుతూ నేడు మంగళవారం సాయంత్రం ఏడు గంటలకు తొమ్మిది రోజుల నుండి పూజలు అందుకుంటున్న మహా గణనాథుడి లడ్డూ వేలం పాట కార్యక్రమం, అనంతరం భక్త మహాశయులకు మహా అన్నదాన కార్యక్రమం ఉంటుందని కావున కొండమల్లేపల్లి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు, ప్రజా ప్రతినిధులు,యువకులు,భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని లడ్డు వేలం ప్రకటన మరియు మహా అన్నదాన కార్యక్రమం విజయవంతం చేయాలని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో తెలిపారు అనంతరం బుధవారం నాడు గణనాథుడి నిమజ్జన శోభాయాత్ర కార్యక్రమాలు ఉంటాయని అన్నారు ఈ కార్యక్రమంలో శివ జ్యోతి నగర్ ఉత్సవ కమిటీ సభ్యులు పాశం వేణుగోపాల్ రెడ్డి, బంగారు సూర్య ప్రకాష్, ముత్తోజు జయశంకర్, బొడ్డుపల్లి శ్రీను,గట్టుపల్లి శేఖర్ రెడ్డి, రమావత్ యాదగిరి నాయక్,కుందారపు సాయి,దొడ్డు సాయి, దొడ్డి ఆనంద్, ముత్తోజు జయకుమార్ మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు