విద్యార్థిని విద్యార్థులకు ఓటు హక్కు పై అవగాహన

మిర్యాలగూడ, జనం సాక్షి. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారుల సూచనల మేరకు స్థానిక విజేత డిగ్రీ పీజీ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు సోమవారం నాడు ఓటు హక్కు పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ తెడ్ల ధనుంజయ మాట్లాడుతూ ఓటు హక్కు కలిగిన ప్రతి విద్యార్థి, విద్యార్థినిలు రాజకీయ నాయకులు చూపే డబ్బు మద్యం లాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఇష్ట ప్రకారమే తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఓటు హక్కును వినియోగించుకునేలా చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత నేటి యువత పై అన్నారు. అవగాహన సదస్సులో డిఆర్డిఏ ఏపీఎం. ఏం శేషయ్య, సి సి. ఎం. సైదులు, ఒకటో పట్టణ కానిస్టేబుల్ మరియు కళాశాల అధ్యాపక బృందం జ్యోతి, సైదాచారి తదితరులు పాల్గొన్నారు