అంగన్వాడి సెంటర్లకు నూతన భవనాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ కు వినతి రామావత్ సేవా నాయక్

కొండమల్లేపల్లి సెప్టెంబర్ 25 జనం సాక్షి : కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని గుర్రపు తండ గ్రామపంచాయతీ పరిధిలోని గుఱ్ఱపు తండ, పన్ని తండలలో అంగన్వాడి సెంటర్లు మంజురైన నాటి నుండి నేటి వరకు15 సంవత్సరాలుగా అద్దె భవనంలో నడుపుతున్నారని వీటి వల్ల ప్రభుత్వ ఖజానా వృధా కావడమే కాకుండా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని గర్భిణీ స్త్రీలకు చిన్న పిల్లలకు సరైన సౌకర్యాలు లేవని వెంటనే అంగన్వాడి సెంటర్లకు నూతన భవనాలు మంజూరు చేయాలని కలెక్టర్ కలిసి వినతిపత్రం అందజేసిన గుర్రపుతండ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు రామవత్ సేవా నాయక్