నక్సలైట్ల వ్యవస్థను నిర్మూలిద్దాం
– సమాచారం ఇస్తే బహుమతులు
– మావోయిస్టు పార్టీ నాయకుల వాల్ పోస్టర్ విడుదల
– ఆళ్లపల్లి ఎస్సై రతీష్

ఆళ్లపల్లి సెప్టెంబర్ 25 (జనం సాక్షి)
నక్సలైట్ల వ్యవస్థను నిర్మూలిద్దామని ఆళ్లపల్లి ఎస్సై రతీష్ అన్నారు. సోమవారం మండలంలోని పలు గ్రామాల్లో మావోయిస్టు పార్టీ నాయకుల వాల్ పోస్టర్లను పోలీస్ సిబ్బందితో గోడలకు అంటించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ… మావోయిస్టుల సమాచారం ఇస్తే బహుమతులు అందజేస్తామని ,వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో నివసించే ఆదివాసీల అభివృద్ధి కి అడ్డుకట్ట వేస్తున్న మావోయిస్టులను నిర్మూలించి, బంగారు భవితను నిర్మిద్దామని అన్నారు. చర్ల, దుమ్ముగూడెం, కరకగూడెం, బయ్యారం, తాడ్వాయి, మంగపేట ,గుండాల ,ఏరియా అడవులలో సంచరిస్తున్నట్లు సమాచారం ఉందని తెలిపారు .ఎవరైనా అపరిచిత వ్యక్తులు కనిపిస్తే స్థానిక పోలీస్ స్టేషన్ కి సమాచారం ఇవ్వాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.