27న “జిల్లా ఏర్పాటు కోసం” మిర్యాలగూడ బంద్ కు సహకరిద్దాం…

మిర్యాలగూడ, జనం సాక్షి.సెప్టెంబర్ 25.

అన్ని అర్హతలు,అవకాశాలు ఉన్న మిర్యాలగూడను నాగార్జున సాగర్ – మిర్యాలగూడ జిల్లా పేరుతో కొత్త జిల్లా ఏర్పాటు చేయాలనీ కోరుతూ ఈనెల 27న జిల్లా సాధన సమితి అధ్వర్యంలో జరగనున్న మిర్యాలగూడ పట్టణ బంద్ కు వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు, ప్రతి ఒక్కరూ సంపూర్ణ మద్దతు తెలిపి బంద్ లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో మిర్యాలగూడ బంద్ కు అన్ని వర్గాల వారు సహకరించి బంద్ లో పాల్గొనవలసిందిగా కోరుతూ విస్తృత ప్రచారాన్ని చేపట్టారు. పాఠశాలలు, కళాశాలలు, హోటల్లు, వివిధ వ్యాపార సంస్థలకు బంద్ సమాచారం తెలియజేయడం జరిగిందని జిల్లా సాధన సమితి నాయకులు పేర్కొన్నారు. ఈనెల 27న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు “స్వచ్ఛంద మిర్యాలగూడ బంద్” కి సహకరిద్దామని మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ పేర్కొన్నారు. బాధ్యతగా విద్యార్థి, అనుబంధ సంఘాల నాయకులు, ప్రతి ఒక్కరూ మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు సాధన ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
మిర్యాలగూడ బంద్ విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్ కోరారు. సమావేశంలో
నీల మోహన్ రావు,ఎంపీటీసీ సైదులు, కోల సైదులు ముదిరాజ్, డాక్టర్ జాడి రాజు,కళాకారుడు దారం మల్లేష్ యాదవ్,దశరథ్ నాయక్,దుర్గాప్రసాద్,కోటయ్య,జయరాజు, కొత్తపల్లి సైదులు, పోగుల సైదులు గౌడ్,రజక సంఘం అధ్యక్షులు దుర్గయ్య, తదితరులు పాల్గొన్నారు.