కుర్మం సంఘం ఆధ్వర్యంలో వినాయకునికి ప్రత్యేక పూజలో పాల్గొన్న ముద్దం నరసింహ యాదవ్

సికింద్రాబాద్ ఆర్ సి సెప్టెంబర్ 24 (జనం సాక్షి) గణపతినవరాత్రులపురస్కరించుకుని ఓల్డ్ బోయిన పల్లి డివిజన్ లో శ్రీ కట్ట మైసమ్మ నగర్ లో శ్రీ బీరప్ప కుర్మం సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని సందర్శించిన స్థానిక కార్పొరేటర్ ముద్దం నర్సింహా యాదవ్, అనంతరం ముద్దం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించి భగవంతుని చిన్న కోరిక కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎటువంటి ఆటంకులు వారి దరి చేరకుండా చూడు స్వామి అంటూకోరుకున్నారు, అనంతరం ఆలయ కమిటీ సభ్యులు పలువురిని శాలువతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. గత ఎనిమిది ఏళ్లుగా శ్రీ బీరప్ప కుర్మం సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు సి హెచ్ పోచయ్య వెల్లడించారు.అనంతరం లడ్డు వేలంనిర్వహించారు, వేలంలో పదివేల 500 రూపాయలు ధర పలికింది, లడ్డును కైవసం చేసుకున్న రాజును శాలువాతో సన్మానించారు.అదేవిధంగా అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ టిపిసిసి సెక్రెటరీ దండుగుల యాదగిరి,డివిజన్ అధ్యక్షుడు మహేష్ యాదవ్, బిఆర్ఎస్ సినియర్ నాయకులు కర్రీ జంగయ్య, బోయిన పల్లి డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు బుర్రి యాదగిరి,చందు యాదవ్, మల్లేష్ యాదవ్, బోయిన పల్లి రిటైర్ మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మక్కల సత్యనారాయణ,శ్రీ బీరప్ప కుర్మం సంఘం ప్రతినిధులుసిహెచ్.పోచయ్య,లింగం,పరుశురాం, తిరుపతి,కార్తీక్,బిఎస్బిరాజయ్,అయిలీ తదితరులు పెద్ద సంఖ్యలోపాల్గొన్నారు.