కీర్తిశేషులు నాల్చర్ శ్రీహరి కల నెరవేర్చిన ఎమ్మెల్యే షిండే

బిచ్కుంద సెప్టెంబర్ 25 (జనంసాక్షి) తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్యానల్ స్పీకర్ జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే హన్మంత్ షిండే తన రాజకీయ గురువు కీర్తిశేషులు నాల్చర్ శ్రీహరి బిచ్కుంద సెంట్రల్ లైటింగ్ కలను సాకారం చేస్తున్నారు. 12 కోట్ల నిధులతో మండలకేంద్రంలో సోమవారం నాడు సెంట్రల్ లైటింగ్ పనులు ప్రారంభం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో తన గురువులు సూచించిన బాటలో నడుస్తూ తనదైన శైలిలో అభివృద్ధియే లక్ష్యంగా ఎమ్మెల్యే షిండే ముందుకు దూసుకెళ్తున్నారు. కాగా మండల ప్రజలు కీర్తిశేషులు నాల్చర్ శ్రీహరి కుటుంబీకులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.