ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సహకారంతో వార్డుల అభివృద్ధి.
మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ దీప_నర్సింలు.

తాండూరు సెప్టెంబర్ 25(జనంసాక్షి)
తాండూరు పట్టణం సాయిపూర్10వ వార్డులో ఎమ్మెల్యే రోహిత్_రెడ్డి ప్రత్యేక నిధులు (ఎస్.డి.ఎఫ్ గ్రాంట్స్) నుండి 50లక్షల రూపాయిల వెయ్యంతో సి.సి రోడ్డు నిర్మాణ పనులను మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ . పట్లోళ్ల_దీప_నర్సింలు ప్రారంభించారు. అనంతరం హైదరాబాద్ రోడ్ మార్గంలోని రాయల్ కాంఠ దగ్గర గ్రీన్ ప్యారడైస్ హోటల్” ను ప్రారంభించారు.ఈ సందర్భంగా వైస్-చైర్ పర్సన్ దీప_నర్సింలు మాట్లాడుతూ..తాండూరు పట్టణంలో మెరుగైన మౌలిక వసతుల కల్పనే ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రధానలక్ష్యమని,అన్ని ప్రాంతాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాబోయే రోజుల్లో ఆదర్శ నియోజకవర్గంగా తాండూరును తీర్చిదిద్దుతు,ప్రతి కాలనీలో మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని అందుకోసం ప్రతి వార్డ్ కి 1కోటి రూపాయలు నిధులను కేటాయించడం జరిగిందన్నారు.రోడ్డు నిర్మాణ పనులతో కాలనీ వాసులకు ఎంతో ఉపశమనం కలుగానున్నదని, రోడ్డు పనుల నాణ్యత లో ఎటువంటి జాప్యం లేకుండా సకాలంలో పనులు పూర్తి చేసి కాలనీ వాసులకు ఇబ్బందులు తలెత్తకుండా త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు,నాయకులు,ప్రజాప్రతినిధులు,వార్డ్ ప్రజలు,యువకులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.