ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి.

జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్

వనపర్తి బ్యూరో సెప్టెంబర్25 (జనంసాక్షి)

ప్రజావాణి ద్వారా వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం ఐ.డి. ఒ సి. ప్రజావాణి హాల్లో అదనపు కలెక్టర్ యస్. తిరుపతి రావు తో కలిసి ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఎంతో నమ్మకంతో ప్రజావాణి కి వచ్చి తమ సమస్యలు లిఖితపూర్వకంగా ఇస్తారని వాటిని సంబంధిత శాఖాధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించి వారి నమ్మకాన్ని నిలబెట్టాలని అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ రోజు మొత్తం 80 ఫిర్యాదులు వచ్చాయి.
అనంతరం ఆయా శాఖలకు సంబంధించిన పెండింగ్ పనులపై సూచనలు చేశారు.
అదనపు కలెక్టర్ యస్. తిరుపతి రావు, పి.డి.డి.అర్.డి. ఒ నర్సింహులు, సి.పి. ఒ వెంకటరమణ, జిల్లా అధికారులు.తదితరులు పాల్గొన్నారు.