బషీరాబాద్ వైన్స్ లో చోరీ బషీరాబాద్ సెప్టెంబర్ 28,(జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో శ్రీ మణికంఠ వైన్స్,వినాయక వైన్స్ లో గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం రాత్రి సమయంలో చోరీకి పాల్పడినట్టు ఎస్.ఐ పి. వేణుగోపాల్ గౌడ్ తెలిపారు. పూర్తి వివరాలు తెలియవలసి ఉందని వైన్స్ యజమానులు తెలిపిన వివరాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ పి. వేణుగోపాల్ గౌడ్ తెలిపారు.