ఇరాన్‌లో ఆత్మాహుతి దాడి: 25 మంది మృతి

మొసుల్‌,(జనంసాక్షి): ఇరాక్‌లో సోమవారం జరిగిన దారుణమైన ఆత్మాహుతి దాడిలో దాదాపు 25 మంది మరణిచారు. ఇంకా 17 మంది సైనికులు, మరో 12 మంది సామాన్యులు గాయపడ్డారు. ఇరాకీ ఆర్మీ కాన్వాయ్‌ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందని భావిస్తున్నారు. ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌కు 400 కిలోమీలర్ల ఉత్తర దిశలో ఈ దాడి జరిగింది.

పేలుడు పదార్థాలతో నిండిన కారుతో ఆత్మాహుతి దళ సభ్యుడు కాన్వాయ్‌ మీదకు దూసుకొచ్చాడు. ఈ ప్రాంతం ఎప్పటినుంచో అల్‌ ఖైదా సహా పలు ఉగ్రవాద సంస్థలకు కేంద్రంగా ఉంది.