రెండు రోజుల్లో రూ.26 కోట్లు వసూలు చేసిన ‘గ్రాండ్‌ మస్తీ’

న్యూఢిల్లీ : బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఇంద్ర కుమార్‌ చిత్రం ‘గ్రాండ్‌మస్తీ’ రెండు రోజుల్లో రూ.26 కోట్లు వసూలు చేసింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా మొదటిరోజు రూ. 12.5 కోట్లు వసూలు చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. గ్రాండ్‌మస్తీ చిత్రంలో రితేశ్‌ దేశ్‌ముఖ్‌, శివ్‌దశాని, వివేక్‌ ఒబెరాయ్‌లు ప్రధాన పాత్రల్లో నటించారు. వచ్చే వారాంతానికి ఈ చిత్రం రూ.40 కోట్లు వసూలు చేస్తుందని చిత్ర వర్గాలు అంచనా వేస్తున్నాయి.