హిమాలయాలపై ఈ నెల 27నుంచి ప్రచారం నిర్వహిస్తాం : కేంద్ర పర్యాటక శాఖ

న్యూఢిల్లీ : అద్భుత పర్యాటక ప్రదేశంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హిమాలయ పర్వత శ్రేణులకు మరింతగా గుర్తింపు తెచ్చేందుకు ఈ నెల 27నుంచి 777రోజుల పాటు ప్రత్యేక ప్రచార కార్యక్రమానికి కేంద్ర పర్యాటక శాఖ శ్రీకారం చుట్టనుంది.ముఖ్యంగా వేసవిలో దేశ, విదేశీ పర్యాటకులను పెద్ద ఎత్తునా ఆకర్షించాలనే ప్రధాన లక్ష్యంతో రూపుదిద్దుకున్న ఈ కార్యక్రమాన్ని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ప్రారంభిస్తారు.