27న కడపలో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన

కేంద్రం దాడులకు వెరిచేది లేదన్న సిఎం రమేశ్‌

కడప,నవంబర్‌28(జనంసాక్షి): డిసెంబర్‌ 27న కడపలో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాన జరగనుందని టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ తెలిపారు. కేంద్రం సహకరించకపోయినా తామే ప్లా4ంట్‌ నిర్మాణానికి పూనుకున్నామని అన్నారు. విబజన హావిూ మేరకు కేంద్రం నడచుకోవడం లేదన్నారు. బుధవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ కడప జిల్లా మైలవరం మండలం కంబాలదిన్నెలో ఉక్కు కర్మాగారం నిర్మాణం జరుగుతుందన్నారు. ఏపీఎండీసీ, ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్లాంటు ఏర్పాటు చేయడం జరుగుతుందని సీఎం రమేష్‌ పేర్కొన్నారు. సుజనాచౌదరి విషయంలో ఈడీ కొత్తగా చెప్పిందేవిూలేదని, ఇన్నాళ్లు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. సుజనా కూడా న్యాయపోరాటం చేస్తారని రమేష్‌ అన్నారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే మోదీ దాడులు చేయిస్తున్నారని, తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల్లో మోదీకి ఎదురుదెబ్బ తప్పదన్నారు. దాడులతో బెరిపోయేది లేదన్నారు. మోడీ విధానాలు ఎండగట్టేందుకే చంద్రబాబు జాతీయరాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తున్నారని అన్నారు.