బస్సు లోయలో పడిన ప్రమాదంలో 27కి చేరిన మృతుల సంఖ్య

ధానె : మహారాష్ట్రలోని ధానె జిల్లాలో విఠల్‌ వాడి-అహ్మద్‌నగర్‌ బస్సు లోయలో పడిన ప్రమాదంలో మృతుల సంఖ్య 27కి సంఖ్య చేరింది. దాదాపు 40 మంది ప్రయాణీకులతో ఉన్న బస్సు ఈ రోజు ఉదయం 250 మీటర్ల లోతులో పడిపోయింది. సహాయ చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. చనిపోయిన వారిలో 19 మంది మహాళలు, 8మంది పురుషులు ఉన్నారు. మరో 17 మందిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సుపైకి టెంపో దూసుకురావడంతో బస్సును తప్పించబోయిన డ్రైవరు అదుపుకోల్పోయినట్లు సమాచారం. పరిసరాల్లో మొబైల్‌ టవర్లు లేకపోవడంతో అక్కడ సెల్‌ఫోన్లు పని చేయడం లేదని, సహాయ చర్చల సమన్వయం కష్టసాధ్యమవుతోందని పోలీసు వర్గాలు తెలిపాయి. వైద్య బృందాన్ని సంఘటనా స్థలానికి పంపినట్లు ధానె రూరల్‌ అదనపు ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌ తెలిపారు.