29 న న్యాయవాదుల సహకార సంఘం డైరెక్టర్ల ఎన్నికలు

వరంగల్ ఈస్ట్ సెప్టెంబర్ 26 (జనం సాక్షి)

ఉమ్మడి వరంగల్ జిల్లా న్యాయవాదుల పరస్పర సహాయక సహకార సంఘంలోని 4 డైరెక్టర్ల స్థానాల ఎన్నికలు 29 న జరగనున్నాయి. 4 డైరెక్టర్ల స్థానాలకు నామినేషన్లు, ఉపసంహరణలు మంగళ వారం గడువు ముగియడం తో మొత్తం 9 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి దాసరి ప్రేమ్ సాగర్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే మొత్తం ఓటర్లు 1250 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని, తమ వెంట ఐడి కార్డ్ లతో వచ్చి బ్యాలెట్ పేపర్‌లోని 4 స్థానాల డైరెక్టర్లలో కనీసం ముగ్గురు అభ్యర్థులకు తప్పనిసరిగా లేదా నలుగురు అభ్యర్థులకు ప్రతి సభ్యుడు ఓటు వేయాలని లేకుంటే వారి ఓటు చెల్లనిదిగా పరిగణించబడుతుందని,
29 న ఉ,,10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కోర్ట్ ప్రాంగణంలో పోలింగ్ జరుగునున్నాయని, రాత్రికి ఫలితాలు వెల్లడించనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయక ఎన్నికల అధికారులు సీఎహ్. చిదంబర్ నాథ్, ఎల్.రాజారాం రెడ్డి, మరియు ఆర్.నాగేంద్ర ఎన్నికల ఏర్పాట్లు చేస్తున్నారు.