డిసెంబర్‌ 3న కేంద్ర మంత్రివర్గం భేటీ

న్యూఢిల్లీ: డిసెంబర్‌ 3న కేంద్ర మంత్రి వర్గం సమావేశం కానుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లును జీవోఎం డిసెంబర్‌ 1 తేదీనే పూర్తి స్థాయిలో రూపకల్పన చేయనుండడంతో, 3న జరిగే కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో బిల్లును ఆమోదించనున్నట్లు సమాచారం.