బస్సు లోయలో పడి 33 మంది మృతి

కౌలాలంపూర్‌ : ప్రమాదవశాత్తూ బస్సు లోయలో పడి 33 మంది మృతి చెందిన సంఘటన మలేసియాలో జరిగింది. పర్యాటకులను విశేషంగా ఆకర్షించే మలేసియన్‌ హైలాండ్‌ రిసార్ట్‌ (మలేసియాలో చట్టబద్ధమైన కాసినో ఇక్కడ మాత్రమే ఉంది) దగ్గర్లో ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో కూడిన బస్సు సుమారు 100 అడుగుల లోయలో పడటంతో ఎక్కువ మంది చనిపోయారని, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు.