రష్యాలో 33కు చేరిన బాంబు దాడి మృతుల సంఖ్య

మాస్కో: రష్యా దేశంలోని వోల్గోగ్రాడ్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో మరో ఇద్దరు మృత్యవాత పడ్డారు. దీంతో ఆది, సోమ వారాల్లో జరిగిన బాంబు దాడుల్లో మీతుల సంఖ్య 33కు చేరింది. ఆదివారం రైల్వే స్టేషన్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 17 మంది మృతి చెంగా, సోమవారం ట్రాలీ బస్సులో జరిగిన ఆత్మాహుతి దాడిలో 10మంది మృతి చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతూ కొందరు మరణించడంతో ఈ రెండు బాంబు దాడుల్లో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 33కు చేరిందని అక్కడి మీడియా వర్గాలు పేర్కొన్నాయి. సోచి నగరంలో త్వరలో వింటర్‌ ఒలింపిక్స్‌ సరగనున్న నేపథ్యంలో బాంబు దాడులు చోటుచేసుకోవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.