ఐదు రోజుల్లో 35 మంది చిన్నారుల మృతి

కోల్‌కతా : గత ఐదు రోజులుగా బీసీ రాయ్‌ ప్రభుత్వ చిన్న పిల్లల వైద్యశాలలో సుమారు 35 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు.తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలతో పోరాడుతున్న చిన్నపిల్లలు ఆస్పత్రిలో చేరుతున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.చిన్నారులు మృతి చెందడం పై వైద్యుల నిర్లక్ష్యం ఏమైనా ఉందా?, అనే అంశంపై స్పందించడానికి ఆస్పత్రి సిబ్బంది నిరాకరించారు.