ఇటలీలో బస్సు అదుపు తప్పడం :37 మంది మృతి

రోమ్‌: దక్షిణ ఇటలీలోని అవెల్లినో ప్రాంతం సమీపంలో ఓ బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 37 మంది మృతి చెందినట్లు అక్కడ సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో గాయపడ్డ 11 మంది ప్రయాణికులను ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.