డిసెంబర్‌ 4న దేశ రాజధానిలో సెలను ప్రకటించండి: ఆవ్‌ ఢిల్లీ:

ఢిల్లీ:డిసెంబర్‌ 4న ఢిల్లీ రాష్ట్రంలో జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌ సీ ఆర్‌)లో సెలవు ప్రకటించాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎన్నికల సంఘాన్ని కోరింది. సెలవు ఇస్తే ఈ ప్రాంతంలో పని చేస్తున్న వినియోగదారులు ఓటు హక్కును వినియోగించుకోగల్గుతారని పార్టీ పేర్కొంది. రాష్ట్ర విధాన సభ ఎన్నికల సందర్భంగా డిసెంబర్‌ 4న ఢిల్లీలో సెలవే అయినా ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో ఉన్న నోయిడా, గుర్‌ గావ్‌, ఫరీదాబాద్‌ ప్రాంతాల్లో పనిదినమే. దాంతో అక్కడి ఉద్యోగులకు ఓటేసే అవకాశం ఉండదు. అందుకే కేంద్ర ప్రభుత్వంతోనూ, సంబంధిత రాష్ట్రాలతోనూ మాట్లాడి అక్కడ కూడా సెలవు ప్రకటించాలని ఆవ్‌ కోరుతోంది.