40 లక్షలతో పాతబస్టాండ్‌ ఆధునీకరణ

కడప,జనవరి23(జ‌నంసాక్షి): కడపలోని పాత బస్టాండ్‌ ను మునిసిపల్‌ చైర్మన్‌ అసం రఘురాం రెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రఘురాం రెడ్డి మాట్లాడుతూ… 40 లక్షల రూపాయలతో పాత బస్టాండ్‌ను అన్ని వసతులతో ఆధునీకరిస్తామని ప్రకటించారు. వారం రోజుల్లో పనులు మొదలు పెడతామని, ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా చూస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ అసం రఘురాం రెడ్డి, పోలీసు శాఖ అధికారులు, డిఎస్‌పి, అందరు సిఐ లు, పోలీసు సిబ్బంది, మునిసిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు. పాత బస్టాండ్‌ను ఆధునీకరించే క్రమంలో నెల రోజుల క్రితమే పాత బస్టాండ్‌లోని చిరు వ్యాపారులకు వారి దుకాణాలను తీసేయాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. ఈ రోజు వాటిని తీసేయాలని అధికారులు చెప్పడంతో చిరు వ్యాపారులంతా తమ ఉపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.