40పైసలు క్షీణించిన రూపాయి

ముంబయి : రూపాయి మరోసారి క్షీణించింది. సోమవారం ఉదయం ట్రేడింగ్‌ ప్రారంభంలో 40 పైసలు తగ్గి రూ.62.91 వద్ద డాలర్‌తో మారకం అవుతుంది.ముడిచమురు దిగుమతిదారుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉండడం,జూన్‌ త్రైమాసిక కరెంట్‌ ఖాతా లోటు రూపాయి విలువ క్షీణతకు కారణమై ఉంటాయని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.