5న కేబినెట్‌ సమావేశం

` కరోనా వైరస్‌ నివారణ, తాజా పరిస్థితుపై చర్చ

` రాష్ట్రంలో వైరస్‌ తగ్గడంతో లాక్‌డౌన్‌పై నిర్ణయం

సర్వత్రా ఆసక్తి

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 30(జనంసాక్షి):కరోనా వ్యాప్తి నివారణ, లాక్‌డౌన్‌ పరిస్థితుపై చర్చించేందుకు ఈనె 5న మధ్యాహ్నం 2 గంటకు తెంగాణ కేబినెట్‌ సమావేశం కానుంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో ఈ కీక భేటీ జరగనుంది. కేంద్ర ప్రభుత్వం 3 వరకు, రాష్ట్ర ప్రభుత్వం 7 వరకు లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. తెంగాణలో 7తో లాక్‌డౌన్‌ ముగియనున్న నేపథ్యంలో భవిష్యత్‌ కార్యాచరణ ఎలా ఉండాలి.. ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాు రూపొందించానే అంశంపై కేబినెట్‌ భేటీలో చర్చించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసు సంఖ్య తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో లాక్‌డౌన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయంపై ఆసక్తి నెకొంది. కేబినెట్‌ భేటీ ముగిసిన అనంతరం ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై సీఎం కేసీఆర్‌ కీక ప్రకటన చేసే అవకాశముంది.