5వ దశ పోలింగ్ ప్రారంభం!

  • 6 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో పోలింగ్
  • బరిలో నిలిచిన 695 మంది అభ్యర్థులు, 8.95 కోట్ల మంది ఓటర్లు
  • రాహుల్ గాంధీ, రాజ్‌నాథ్ సింగ్ సహా బరిలో పలువురు ప్రముఖులు

లోక్‌సభ ఎన్నికల 2024 లైవ్ అప్‌డేట్‌లు: ఆరు రాష్ట్రాలు మరియు రెండు కేంద్ర పాలిత ప్రాంతాలలోని 49 నియోజకవర్గాల ఓటర్లు ఈరోజు లోక్‌సభ ఎన్నికల ఐదవ దశ పోలింగ్‌లో ఓటు వేయనున్నారు.
బీహార్, జార్ఖండ్ (3), మహారాష్ట్ర (13), ఒడిశా (5), ఉత్తరప్రదేశ్ (14), పశ్చిమ బెంగాల్ (7) మరియు రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు – జమ్మూ కాశ్మీర్ (1) మరియు లడఖ్‌లోని ఐదు పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. (1)

ఐదవ దశలో పోటీ చేసే ముఖ్య అభ్యర్థుల్లో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్ (ముంబై నార్త్), స్మృతి ఇరానీ (అమేథీ), రాజ్‌నాథ్ సింగ్ (లక్నో) ఉన్నారు.

ప్రతిపక్షం నుంచి కాంగ్రెస్‌కు చెందిన రాహుల్‌ గాంధీ తన తల్లి సోనియా గాంధీ కంచుకోట అయిన రాయ్‌బరేలీని, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బారాముల్లా నుంచి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య సరన్ నుంచి, శివసేన-యూబీటీ నేత అరవింద్ పోటీ చేస్తున్నారు. సావంత్ ముంబై సౌత్ నుంచి పోటీ చేస్తున్నారు.

ఎన్నికల బరిలో ప్రముఖులు వీరే 
మహారాష్ట్రలో ఉత్తర ముంబై నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి పియూష్ గోయల్, డిండోరీ నుంచి భారతీ పవార్, ముంబై నార్త్‌ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ప్రముఖ లాయర్ ఉజ్వల్ నికమ్ బరిలో నిలిచారు.

ఉత్తరప్రదేశ్‌లోని లక్నో పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి రాజ్‌నాథ్ సింగ్, అమేథీ నుంచి స్మృతీ ఇరానీ, ఫతేపూర్ నుంచి సాధ్వీ నిరంజన్ జ్యోతి, మోహన్‌లాల్ గంజ్ నుంచి కౌషల్ కిషోర్ పోటీ పడుతున్నారు.

బీహార్‌లోని హజీపూర్ నుంచి చిరాగ్ పాశ్వాన్, శరన్ నుంచి రాజీవ్ ప్రతాప్ రూడీ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

పశ్చిమబెంగాల్‌లోని బరాక్ పూర్ నుంచి బీజేపీ నేత అర్జున్ సింగ్, హుగ్లీ నుంచి లాకెట్ ఛటర్జీ, సేరంపూర్ నుంచి కల్యాణ్ బెనర్జీ బరిలో ఉన్నారు.

ఒడిశాలో బీజేడీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, జువాల్ ఓరామ్, దిలీప్ టిర్కే బరిలో నిలిచారు.

జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా సీటు నుంచి ఒమర్ అబ్దుల్లా, సాజద్ లోన్, ఫయాజ్ అహ్మద్ మీర్ పోటీ పడుతున్నారు.

కీలక నియోజకవర్గాలు ఇవే
యూపీలోని అమేథీలో బీజేపీ నేత స్మృతీ ఇరానీ కాంగ్రెస్‌కు చెందిన ఎల్‌కే శర్మతో పోటీ పడుతున్నారు. రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీ, బీజేపీ నేత దినేశ్ ప్రతాప్ సింగ్‌తో తలపడుతున్నారు. రాజ్‌నాథ్ సింగ్, ఎస్పీ నేత రవిదాస్ మెహ్రోత్రా కూడా పరస్పరం తలపడుతున్నారు.

బీహార్లో చిరాగ్ పాశ్వాన్ హాజీపూర్‌లో ఆర్జేడీ నేత శివ్ చంద్రరామ్‌తో పోటీపడుతున్నారు. శరన్‌లో బీజేపీ నేత రాజీవ్ ప్రతాప్ రూడీ, రోహిణీ ఆచార్యతో బరిలో నిలిచారు.

గత నాలుగు దశల్లో పోలింగ్ శాతం 66.95గా నమోదైంది. 45.1 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 379 సీట్లలో పోలింగ్ పూర్తయ్యింది. ఇక ఆరవ, ఏడవ దశ ఎన్నికలు వరుసగా మే 25, జూన్ 1న జరగనున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపడతారు.