పాట్నా బాంబు పేలుళ్లలో 5కి చేరిన మృతుల సంఖ్య

పాట్నా : పాట్నాలో ఈరోజు జరిగిన వరుస బాంబు పేలుళ్ల సంఘటనలో మృతుల సంఖ్య 5కి చేరింది. రైల్వే స్టేషన్లో మొదటి నాటు బాంబు పేలినప్పుడు ఒకు మృతిచెందిన విషయం తెలిసిందే. తర్వాత జరిగిన వరుస సంఘటనల్లో 50మందికి పైగా గాయపడగా చికిత్స పొందుతూ నలుగురు మృతిచెందినట్లు పాట్నా వైద్య కళాశాల సూపరింటెండెంట్‌ తెలిపారు.