రేపు అగ్ని – 5పరీక్ష
బాలాసోర్ : అణ్వస్త్ర సామర్థ్యమున్న ఖండాతర క్షిపణి అగ్ని – 5ను మరోసారి పరీక్షించేందుకు భారత్ సన్నాహాలు చేస్తోంది. అంతా అనుకున్నట్టే సాగి, వాతావరణం అనుకూలిస్తే రేపు ఒడిశా తీరంలోని వీలర్ ఐలాండ్ నుంచి ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ అధికారి ఒకరు తెలిపారు. ఈ క్షిపణిని గత ఏడాది ఏప్రిల్ 19న తొలిసారిగా పరీక్షించిన సంగతి తెలిసిందే. అదేస్థాయిలో ఈ సారి కూడా విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదిస్తుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేశారు.