పాకిస్థాన్‌లో భారీ వర్షం :53 మంది మృతి

పాకిస్థాన్‌: గత మూడు రోజులుగా పాకిస్థాన్‌లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలకు దాదాపు 53 మంది మరణించారు. పలువురి ఇళ్లు ధ్వంసమయ్యాయని విపత్తు నిర్వహణ విభాగాధికారి సోమవారం తెలియజేశారు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ముఖ్యంగా జులై, ఆగుస్టు నెలల్లో పాకిస్థాన్‌ ఈ వరదల సమస్యను ఎదుర్కొంటుంది. 2010 సంవత్సరంలో ఏకంగా 1700 మంది వరదల కారణంగా మరణించారు.