పాకిస్థాన్‌ వరదల్లో 53 మంది మృతి

ఇస్లామాబాద్‌,(జనంసాక్షి): పాకిస్థాన్‌ను భారీగా వరదలు ముంచెత్తుతున్నాయి. దేశంలో కురుసున్న వర్షాల కారణంగా దాదాపు 53 మంది మృతిచెందారని ఆదేశ విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. వరద నీరు వెల్లువెత్తడంతో పలు ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగాయి. వరదల్లో చిక్కుకున్న వారిని అధికారులు సంక్షేమ శిబిరాలకు తరలిస్తున్నారు.