59 జీవో దరఖాస్తుల పరిశీలించిన ఆర్డీవో.

క్షేత్ర స్థాయిలో దరఖాస్తులు పరిశీలిస్తున్న ఆర్డీవో.
నెన్నెల, సెప్టెంబర్26, (జనంసాక్షి)
59 జీవో కింద చేసుకున్న దరఖాస్తులను సోమవారం బెల్లంపల్లి ఆర్డీవో శ్యామల దేవి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మండల వ్యాప్తంగా 19 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 11 దరఖాస్తులు నెన్నెల మండల కేంద్రం నుంచి వచ్చాయని ఆమె తెలిపారు. ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణలో 124 గజాలకు పై బడిన దరఖాస్తులపై విచారణ చేపట్టినట్లు ఆమె వివరించారు. దరఖాస్తుల విచారణ అనంతరం నివేదికను ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు ఆమె తెలిపారు. ఆమె వెంట తహసీల్దార్ భూమేశ్వర్, సర్వే టీం సభ్యులు హమీద్ అహ్మద్, లక్ష్మీ రాజయ్య, మండల గీ